దాడికి పాల్పడిన వ్యక్తిని స్తంభానికి కట్టేసిన స్థానికులు

76చూసినవారు
కత్తితో దాడికి పాల్పడ్డాడని వ్యక్తిని కరెంటు స్తంభానికి కట్టేసిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని వలంద పాలెంలో కత్తితో దాడికి పాల్పడ్డాడని ఓ వ్యక్తిని స్థానికులు కరెంటు స్తంభానికి కట్టేసారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని విడిపించి ఇరువురిని విచారించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్