కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ అధికారులను దొంగ పట్టాల గురించి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నాం కదా అని అడ్డదారిలో కుమారుడు కోసం ఎమ్మెల్యే పేర్ని నాని ఇన్ని నాటకాలు ఆడాలా అని విమర్శించారు. మురుగు పోరంబోకు స్థలాలలో సర్వే నెంబర్లు లేకుండా పట్టాలు ఇవ్వడాన్ని కొల్లు రవీంద్ర ఖండించారు. ప్రజల పక్షాన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు.