మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్ కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం హాజరయ్యారు. ఒకే కార్లో రోడ్ షో చేసుకుంటూ భారీ ర్యాలీగా ముందుకు సాగారు. మైలవరంలో టిడిపి జెండా ఎగరవేయాలని మాజీ మంత్రి పార్టీ శ్రేణులకు సూచించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు.