ఇబ్రహీంపట్నం: అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఎమ్మార్వో వెంకటేశ్వర్లు

74చూసినవారు
ఇబ్రహీంపట్నం: అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఎమ్మార్వో వెంకటేశ్వర్లు
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. అందులో భాగంగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు ఫారాలు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిటర్నింగ్ అధికారిగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. అధికారి హోదాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. పరిశీలించి నమోదుకు సిఫార్సు చేస్తారు.

సంబంధిత పోస్ట్