ఇబ్రహీంపట్నంలో ప్రమాదపు అంచున ప్రయాణం

588చూసినవారు
ఇబ్రహీంపట్నం ఫేర్రీ నుండి రాయపూడి వరకు కృష్ణా నదిపై నిత్యం లాంచితో వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కృష్ణా నదిలో నీళ్లు లేకపోవడంతో లాంచీ ప్రయాణం ఇబ్బందిగా మారి రద్దు చేశారు. నాటు పడవల యజమానులు ప్రజల ప్రాణాలను సైతం బలి పెట్టి డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డారు. ఫెర్రీ నుండి రాయపూడి వరకు ఒక పడవలో సుమారు 15 నుండి 20 మందిని ఎక్కించుకొని ఏరు దాటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్