వినాయక నిమజ్జనంలో ఘర్షణ... రంగంలోకి పోలీసులు

58చూసినవారు
వినాయక నిమజ్జనంలో ఘర్షణ... రంగంలోకి పోలీసులు
పెడన మండలం చెన్నూరు గ్రామంలో వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో ఎస్సి - కాపు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ ఘర్షణలో నిమజ్జనానికి ఊరేగింపుగా వెళుతున్న డీజే బాక్సులను బద్దలు కొట్టి పరారయ్యారు. దీంతో దళితులంతా రోడ్డుపై బైఠాయించి దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దోషులను అదుపులోకి తీసుకొని తగు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్