గణనాధుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి: ఎమ్మెల్యే

63చూసినవారు
గణనాధుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి: ఎమ్మెల్యే
మహాగణనాధుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పెడనలో ఏర్పాటు చేసిన మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్