అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు

1061చూసినవారు
ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎత్తి వేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కోరారు. గత కొన్ని రోజులుగా ఉయ్యూరులోని ఆర్టీసీ డిపో ఎత్తి వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ విషయంపై గురువారం స్పందించారు. డిపో మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్