పెడన పట్టణం బుధవారం నాడు బల్లిపరు గ్రామంలో ఉమ్మడి రాష్ట్రడిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసంఅనేక సేవా కార్యక్రమాలు చేసిన మహనీయులుగా చరిత్రలో నిలిచారని ఆన్నారు. దారిద్ర రేఖ దిగువున ఉన్నప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో కీలకపాత్ర వహించారని తెలిపారు.