మద్దూరులో కేంద్ర బృందం పర్యటన

75చూసినవారు
మద్దూరులో కేంద్ర బృందం పర్యటన
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణియం సారథ్యంలో బృందం వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం పర్యటించింది. కంకిపాడు మండలం మద్దూరులో వరద ప్రభావిత* ప్రాంతాల్లో బృందం పర్యటించి వరద నష్టం పరిశీలించింది. కేంద్ర బృందం వెంట జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లు పర్యటించి నష్టం వివరాలను కేంద్ర బృందానికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్