గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం

74చూసినవారు
మామిడి ఆకుల విషయంలో ఘర్షణలో గాయాల పాలైన యువకుడు పరిస్థితి విషమంగా మారింది. శనివారం యనమలకుదురు రామలింగేశ్వర నగర్ కు చెందిన మిర్యాల అర్జునరావు మామిడి ఆకులు కోయడానికి బంధువుల ఇంటికి వెళ్ళాడు. గెడ్డం నాంచారయ్య తమ అనుమతి లేకుండా మామిడి ఆకులు ఎలా కోస్తారని వాగ్వాదం చేశాడు. మాట మాట పెరగడంతో కత్తి తీసుకువచ్చి మిర్యాల అర్జునరావుపై దాడి చేశాడు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత పోస్ట్