ఏ. కొండూరులో విషజ్వరాలతో ప్రజలు మంగళవారం అల్లాడుతున్నారు. పారిశుధ్యం లోపం కారణంగా గడిచిన రెండు వారాల్లోనే ముగ్గురు మృతి చెందటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు ఆందోళన గురవుతున్నారు. చేతిపంపు ద్వారా కలుషిత మురికినీరు వస్తుందని అధికారులకు మొర పెట్టుకున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో దోమలు వృద్ధి చెంది అనారోగ్యానికి గురవుతున్నామనిన్నారు.