బదిలీల జీవో విడుదల చేయాలి

1542చూసినవారు
బదిలీల జీవో విడుదల చేయాలి
సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బదిలీల జీవోను వెంటనే విడుదల చేసి బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగుల సంఘం, డెమోక్రాటిక్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ 69/21 తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోసెఫ్ కిషోర్ గ్రామా వార్డ్ సచివాలయ డైరెక్టర్ శ్రీ లక్ష్మీషా గారికి సోమవారం నిర్మాణ్ భవన్, విజయవాడలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. తిరుపతి జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విక్రమాదిత్య, ప్రధాన కార్యదర్శి ఏ. కిషోర్ పాల్గొన్నారు. గ్రామా వార్డ్ ఉద్యోగుల సమస్యలపై తక్షణ కార్యచరణ రూపొందించి, సమస్యలను పరిష్కారం చెయ్యడానికి కృషి చేస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్