హిడెన్ కెమెరాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

70చూసినవారు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో కలకలం రేపుతున్న హిడెన్ కెమోరాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినమైన చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించడం యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్