మిరప రైతు రుణాలు మాపీని మేనిఫెస్టోలో చేర్చాలి
By W. Abdul 73చూసినవారుఅధికార, ప్రతిపక్ష కూటములు మిరప రైతులను ఆదుకునేందుకు ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం, బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చాలని ఏఏడిఏ కన్వీనర్ హెచ్ ఆదినారాయణ రెడ్డి మంగళవారం ఆదోనిలో విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నేడు మిరప రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మేనిఫెస్టోలో చేర్చకుంటే స్వచ్చంధంగా రైతులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.