నీటిగుంతలో వరినాట్లు వేసి సీపీఎం వినూత్న నిరసన

65చూసినవారు
అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సి. బెళగల్ లో సీపీఎం నాయకులు వినూత్న నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు, గూడూరు ప్రధాన రోడ్డులో ఏర్పడిన నీటిగుంతలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్లకు మరమ్మతులు చేయించకుంటే ఆందోళనలు ఉధ్రతం చేస్తామని సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. సీపీఎం నిరసనకు ప్రజా సంఘాల నాయకులు సైతం మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్