సుంకేసుల జలాశయానికి 12, 233 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో

61చూసినవారు
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు బుధవారం ఉదయం 12, 233 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 3 గేట్లు ఎత్తి 11, 238 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్