సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని సాగనంపుదామని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం గూడూరులో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం సర్వనాశనం చేసారని ధ్వజమెత్తారు. ఇంకోసారి జగన్ వస్తే జనం ఇళ్లూ, పోలాలు తాకట్టు పెడతారని, ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలన్నారు.