వైసీపీకి మెజారిటీ తగ్గినందుకు ఎమ్మెల్యేకు క్షమాపణ

85చూసినవారు
మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డికి పెద్దకడబూరు మండలం నుండి మెజారిటీ తగ్గినందుకు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పారు. శనివారం పెద్దకడబూరులో జరిగిన వైసీపీ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెద్దకడబూరు మండలం నుండి వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని కృషి చేస్తామని, అలాగే కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు

సంబంధిత పోస్ట్