గోనెగండ్ల మోడల్ స్కూల్ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు

71చూసినవారు
గోనెగండ్ల మోడల్ స్కూల్ విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు
గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూలులో చదివిన విజయలక్ష్మికి అపోలో చిత్తూరులో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈమె 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మోడల్ స్కూల్లో చదివారు. విద్యార్థిని తల్లిదండ్రులు లలిత, జనార్దన్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్