ఉపాధి పని తీరు పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి

84చూసినవారు
ఉపాధి పని తీరు పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి
కర్నూలు జిల్లాలోని అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల అవసరాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. బుధవారం కర్నూలులోని కలెక్టరేట్ నుంచి ఉపాధి హామీ, హౌసింగ్ తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడంలో వెనకబడి ఉండటం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్