ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అవసరమైన కంట్రోల్ యూనిట్లు ఎమ్మిగనూరుకు చేరినట్లు ఆర్వో చిరంజీవి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కంట్రోల్ యూనిట్లు 654, బ్యాలెటింగ్ యూనిట్లు 654, వీవీప్యాడ్లు 709 వచ్చాయన్నారు. వీటిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు, ఎన్నికల అధికారుల సమక్షంలో భద్రపరిచనట్లు పేర్కొన్నారు.