ఆదోనిలోని 27వ సచివాలయంలో చోరీ జరిగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల మేరకు పింఛన్కు సంబంధించిన రూ. 17 లక్షలు బ్యాంకు నుండి తీసుకొనివచ్చి లెక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మాయ మాటలు చెప్పి రూ. 50 వేలు తీసుకెళ్లాడని తెలిపారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.