ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన మాల లక్ష్మి చిప్పగిరికి మిర్చి కోతల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆమె కుటుంబానికి రూ. 25 లక్షలు, గాయపడిన వారికి చెరో రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే. లింగన్న, మండల కార్యదర్శి డి. రామాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం చాగి గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని వారు పరామర్శించారు.