ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్ర పోటీల్లో విజేతగా పంజాబ్ యూనివర్సిటీ పాటియాలా నిలిచింది. అంతకుముందు నాలుగవ రోజులుగా జరుగుతున్న పోటీలను బుధవారం ముఖ్య అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్టికె నాయక్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంకన్న విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందించారు.