శ్రీవేణుగోపాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అహోబిలేశుడు

84చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నృసింహ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని వేద పండితులు శ్రీ వేణుగోపాలునిగా (వేణుగోపాలన్) అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మాడవీధులలో జరిగిన ఊరేగింపు ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్