విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రీ మృతి

4435చూసినవారు
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండల కేంద్రం లో శనివారం విషాదం చోటుచేసుకుంది. తాపీ మేస్త్రిగా పని చేస్తున్న దూదేకుల రాజా హుస్సేన్ (33) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఉదయం కూలి పనుల నిమిత్తం వెళ్ళి సెంట్రింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్