రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి సంక్షేమం అందించే ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం దొర్నిపాడు మండలంలోని క్రిష్టిపాడు గ్రామ ఎంపీటీసీతో సహా 30 కుటుంబాలు మాజీమంత్రి అఖిల ప్రియ సమక్షంలో వైసిపీని వీడి టీడీపీలో చేరాయి. అఖిల ప్రియ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని తెలిపారు.