బేతంచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు దూరవిద్య పదవ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి జి. సోమశేఖర్ శనివారం తెలిపారు. 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల హెడ్ మాస్టర్ ను సంప్రదించాలని తెలిపారు.