ఏపీ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన తహసిల్దార్

84చూసినవారు
ఏపీ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన తహసిల్దార్
బేతంచర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ గ్రామ సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ ను తహసిల్దార్ ప్రకాష్ బాబు, ఈఓఆర్డి వెంకటరంగ నాయక్ లు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అమలవుతున్న తీరును, అక్కడి వసతులను విద్యార్థులను అడి తెలుసుకున్నారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియాదాసు, ఎస్ఎంసీ చైర్మన్ బాలకృష్ణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్