గూడూరులో 20 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా

62చూసినవారు
గూడూరు నగర పంచాయతీలో వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న 20 మంది వాలంటీర్లు బుధవారం తమ విధులకు రాజీనామా చేశారు. వాలంటీర్లు మూకుమ్మడిగా కలిసి కమిషనర్ దివాకర్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. తమ వ్యక్తిగత కారణాలతో వాలంటీర్ల పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రాజీనామాను ఆమోదించాలని నగర పంచాయతీ కమిషనర్ దివాకర్ రెడ్డిని వారు కోరారు.

సంబంధిత పోస్ట్