కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆటో చోరీకి గురైంది. గురువారం గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మలిగెపోగు రాజు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ21 టీవీ 0495 నంబర్ ఆటోలో ఆసుపత్రికి వచ్చారు. ఓ వార్డు వద్ద ఆటోను పార్క్ చేసి వార్డులోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తస్కరించారు. తాను ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, సమాచారం తెలిస్తే 9441620752, 8688170293 తెలపాలన్నారు.