ప్రజలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ అన్నారు. సోమవారం సి. బెళగల్ మండలం బురన్ దొడ్డి, కృష్ణదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పథకాలు లబ్ధిపొందాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అలాంటిది లేదని స్పష్టం లేదన్నారు.