కర్నూలులో శ్రీరామ నవమి సందర్బంగా భార్గవ్, మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరాముని శోభ యాత్రలో బుధవారం శోభయమానంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు, ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం. శ్రీహర్ష హాజరయ్యారు. శ్రీరాముని ఆశీర్వాదంతో కర్నూలు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలిని ఆయన కోరారు. కార్యక్రమంలో 9 వ వార్డు కార్పొరేటర్ నవీన్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.