మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు కృషి చేద్దామని
టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి,
టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ పిలుపునిచ్చారు. గురువారం పెద్దకడబూరులో వారి స్వగృహం నందు
ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీడీపీ నేతలు ఈరన్న, ఏసేపు, మల్లికార్జున ఉన్నారు.