గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలి: సిపిఐ

551చూసినవారు
గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలి: సిపిఐ
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామ గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సిద్దేశ్వరం గ్రామ గిరిజన కాలనీలో విద్యుత్, మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమంలో తాసిల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ కు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఒక వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమైక్య నాయకులు పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్