నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం ఈఓ గా శ్రీనివాసరెడ్డి పదవీ బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర రెడ్డి కమీషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకొనున్నట్లు తెలిసింది. కోటప్పకొండ ఈఓ గా విధులు నిర్వహిస్తున్న ఈయనను దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మహానంది దేవస్థానం ఈఓ గా ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.