వరద బాధితులకు రూ. 2. 87 లక్షల విరాళాలు అందజేత

73చూసినవారు
వరద బాధితులకు రూ. 2. 87 లక్షల విరాళాలు అందజేత
విజయవాడ వరద ముంపు బాధితులకు విరాళాలు అందించడం చాలా సంతోషంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఆదివారం కల్లూరు ఎమ్మెల్యే స్వగృహంలో పలుగ్రామాల నాయకులు వరద బాధితుల కోసం చెక్కులను అందజేశారు. టీడీపీ నాయకులు వాకిటి మాదేష్ ఆధ్వర్యంలో రూ. 1, 11, 016 విరాళాన్ని గౌరు చరితకు అందజేశారు. అలాగే తడకనపల్లె సర్పంచు, టీడీపీ నాయకురాలు ఎస్. సహారాఖీ ఆధ్వర్యంలో సేకరించిన రూ. 1, 76, 100ను ఎమ్మెల్యేకు అందజేశారు.

సంబంధిత పోస్ట్