మండలంలో కేతవరం నుంచి గార్గేయపురం వరకున్న రహదారి అధ్వానంగా మారిపోయింది. దీంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మొత్తం గుంతలమయమై తారు లేచిపోయింది. మట్టి బయటపడటంతో ద్విచక్రవాహన దారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర వేళల్లో ఈ దారి గుండా వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతోందని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.