పాణ్యం: ఎన్సీబీఐ పేరుతో డబ్బులు వసూలు.. విలేకర్లు అరెస్టు

56చూసినవారు
పాణ్యం: ఎన్సీబీఐ పేరుతో డబ్బులు వసూలు.. విలేకర్లు అరెస్టు
నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న 5 మంది పత్రిక విలేకర్లను ఓర్వకల్లు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సీఐ చంద్రబాబు నాయుడు వివరాలు తెలిపారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి వచ్చామని నన్నూరుకు చెందిన బెస్త గంగాధర్, పింజరి పెద్దయ్యలు ఇంటి వద్దకు ఫార్చునర్ కారులో వచ్చిన వారు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారని, రూ. 2.50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పోలీసులు రావడంతో కారును వదలి పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 5 మంది విలేకర్లను, 7 సెల్ ఫోన్లు, ప్రెస్ ఐడీ కార్డులు, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్