పాణ్యం: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

54చూసినవారు
పాణ్యం: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పేర్కొన్నారు. సోమవారం కల్లూరు మండలం లక్ష్మీపురంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో 25 శాతంతో సబ్సిడీ పప్పుశనగ విత్తనాల పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్