మహాశివరాత్రి ఉత్సవాలలో పత్తికొండ పట్టణానికి చెందిన చేనేత కులస్తులు (నేసే) బాలికలు, మహిళలు శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ముందు భాగంలో భారీ ఎత్తున బారులు తీరారు. బాలికలు హారతి ప్లేట్లతో దర్శనమిచ్చారు. మహిళలు, చేనేత వృత్తిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.