కర్నూలు డీసీసీబీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ

73చూసినవారు
కర్నూలు డీసీసీబీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ
ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటైంది. డీసీసీబీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గీత ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చూస్తూ సీఇవో విజయకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీబీలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురైతే ఏజీఎం గీత (9951616115), ఇందిరా ప్రియదర్శిని (9951027790) సంప్రదించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్