పత్తికొండ నియోజకవర్గం
జనసేన పార్టీ సమన్వయకర్త రాజశేఖర్ తల్లిదండ్రులు నిర్వహిస్తున్న కిరాణా దుకాణానికి గుర్తు తెలియని దుండగులు నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి నిప్పు పెట్టారు. కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు రాజశేఖర్ తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యతిరేక శక్తులు తన తల్లిదండ్రుల దుకాణానికి నిప్పు పెట్టి, బూడిద పాలు చేశారని అన్నారు.