శివపార్వతుల కళ్యాణోత్సవాలతో పునీతమవుతున్న పత్తికొండ పట్టణం

566చూసినవారు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పత్తికొండ పట్టణంలో శివపార్వతుల కళ్యాణోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో, విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆలయాల నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్