వైసీపీ నుండి టిడిపిలో 60 కుటుంబాలు చేరిక
ప్యాపిలి మండలం పోదొడ్డికి చెందిన ఎల్. రామి రెడ్డి, ఎల్. సూర్య నారాయణ రెడ్డి, ఎల్. వాసు నారాయణ రెడ్డి, చిన్న సుంకప్పతో పాటు సుమారు 60 కుటుంబాల వారు శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు.