రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలి

56చూసినవారు
రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలి
రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని నంద్యాల జిల్లా మహానంది మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం గోపవరం గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో, ఖరీఫ్ కు సంబంధించి పంట నమోదు కార్యక్రమం చేస్తున్నామని, రైతులు సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బందిని కలిసి తాము వేసిన పంటలను నమోదు చేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్