అమ్మవారికీ కైంకర్యాలు పరిపూర్ణంగా జరపాలి: ఈవో
By M. Vinod 57చూసినవారుశ్రీశైల క్షేత్రంలో శుక్రవారం నిర్వహించే అమ్మవారి కుంభోత్సవానికి సంబంధించిన ఆయా కైంకర్యాలు అన్నింటిని పరిపూర్ణంగా జరిపించాలని ఈవో పెద్దిరాజు ఆదేశించారు. గురువారం ఆయన కుంభోత్సవం నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. సీఐ ప్రసాదరావు, ఎస్ఐ గంగయ్య యాదవ్, దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, ఏఈఓలు ఐ. ఎన్. వి. మోహన్, ఎం. హరిదాసు తదితరులున్నారు.