ప్రభుత్వ టీచర్ ఇంట్లో పట్టపగలే దొంగతనం చేసిన ఘటన ఎమ్మిగనూరులో మంగళవారం జరిగింది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో సరితా అనే టీచర్ విధుల నిమిత్తం స్కూల్కు వెళ్లగా, ఇంటికి తాళం వేసుకొని భర్త మాధవ్ రెడ్డి బయటకు వెళ్లారు. ఆ సమయంలో దొంగ ఆ ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.