లోన్ యాప్ వేధింపులు.. యువకుడు బలి

63చూసినవారు
లోన్ యాప్ వేధింపులు.. యువకుడు బలి
విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వంశీకృష్ణ (22) నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అవసరాల కోసం లోన్ యాప్‌లో వంశీ రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీతో కలిపి రూ.లక్ష చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు. తాను చనిపోతున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. తాడేపల్లిలోని కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్